మంచులో చిక్కుకున్న కార్తికేయ2 టీమ్.. !

హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.

తన కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఈ మధ్యనే పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయిన నిఖిల్ ఇప్పుడు మంచి హిట్ కొట్టి ప్రొఫెషనల్ లైఫ్ కూడా సెట్ చేసుకోవాలని చూస్తున్నాడు.కార్తికేయ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా తీస్తున్నాడు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 తెరకెక్కుతుంది.

ఈ సినిమాను టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ గుజరాత్ లోని ద్వారకా లో 20 రోజుల పాటు జరిగింది.

Advertisement

రెండవ షెడ్యూల్ కోసం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళింది చిత్ర యూనిట్.కులుమనాలి లో నాలుగు రోజులు పాటు షూటింగ్ జరుపు కోవాల్సి ఉండగా ఈ నెల 21 న అక్కడికి వెళ్లారు.

అయితే అక్కడ మంచులో చిత్ర యూనిట్ కురుకు పోయినట్లు వీడియో ద్వారా తెలిపారు.దాదాపు 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా షూటింగ్ జరుపుకోవడానికి అడ్డంకిగా మారిపోయిందని నిఖిల్ ఒక వీడియో పంపారు.

భారీగా కురుస్తున్న మంచు లో కూడా చందు మొండేటి యాక్షన్ చెబుతూ కనిపించాడు.భారీగా పడుతున్న మంచు తుఫాను వల్ల క్యారవాన్ లోనే టీమ్ గడుపు తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.దాదాపు 5118 సంవత్సరాల క్రితం కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అనంత సంపద కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు