హైదరాబాద్ పబ్ లో సిద్ శ్రీరామ్ కి అవమానం

టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న గాయకుడు సిద్ శ్రీరామ్.

మలయాళీ సింగర్ అయిన సిద్ శ్రీరామ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గీతాగోవిందం సినిమాలో సాంగ్ తో ఒక్కసారిగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.

ఆ సినిమాలో సిద్ పాడిన పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడమే కాకుండా సినిమా మీద హైప్ పెరగడానికి కూడా కారణం అయ్యింది.ఆ తరువాత కూడా సిద్ శ్రీరామ్ పాడిన పాటలు కొన్ని సినిమాల సక్సెస్ లో భాగం అయ్యాయి.

ఇక ఈ సెంటిమెంట్ భాగా వర్క్ అవుట్ కావడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ అతని వెంట పడుతున్నారు.సిద్ శ్రీరామ్ పాట పాడితే సినిమా గ్యారెంటీ హిట్ అనేబలమైన నమ్మకం దర్శకులకి కలగడంతో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఆయనతో సాంగ్స్ పాడించుకుంటున్నారు.

ఆయన నుంచి వస్తున్న పాటలు కూడా సోషల్ మీడియాలో అలాగే వేవ్ క్రియేట్ చేస్తున్నాయి.సిద్ శ్రీరామ్ పాట అంటే ఎగబడి మరీ సోషల్ మీడియాలో అతని గొంతుకకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఓపెన్ చేసి చూడటమే కాకుండా విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Advertisement

అయితే గొంతుక ఎంత భాగున్నా అన్ని పాటలని ఒకే మాదిరిగా పాడుతాడనే విమర్శలు కూడా అతని మీద ఉన్నాయి.అలాగే పాటలలో అతని తెలుగు వాచకం కూడా చాలా తప్పుగా ఉంటుందని, పూర్తిగా అర్ధాలు మారిపోతూ ఉంటాయని సాహితీప్రియులు విమర్శిస్తూ ఉంటారు.

ఏది ఏమైనా ప్రస్తుతం టాలీవుడ్ లో అతని ట్రెండ్ నడుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ ఓ పబ్ లో సిద్ శ్రీరామ్ కి ఘోర అవమానం జరిగింది.

ఓ ఈవెంట్ కి హాజరైన సిద్ పై పబ్ లో కొంత మంది ఆకతాయిలు తాగిన మత్తులో నీళ్ళు, మద్యం విసిరారు.అకాయితాయిలను‌ గెట్ అవుట్ అంటూ సిద్ శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చాడు.

వెంటనే అక్కడున్న పబ్ యాజమాన్యం జోక్యం చేసుకుని గొడవను ఆపేసారని తెలుస్తుంది.ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు