ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కు నటి బిగ్ పార్టీ.. ఎవరో తెలుసా?

ఈ మధ్య సామాన్యుల నుండి నటుల వరకు సోషల్ మీడియా బాగా దగ్గరయ్యింది.సోషల్ మీడియా వేదికగా సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ.

విపరీతమైన ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు.ఇలా టాలీవుడ్, బాలీవుడ్ ప్రతి ఒక్క సినీ పరిశ్రమ నటీనటులు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఇష్టాఇష్టాలను పంచుకుంటున్నారు.

తాజాగా ఓ నటి తన పాపులారిటీని పెంచుకోవడానికి తన సోషల్ మీడియా ద్వార ఫాలోవర్స్ కు బిగ్ పార్టీ ని అందించింది.ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసా.

ప్రముఖ టెలివిజన్ నటి దర్శా గుప్తా.ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంది.

Advertisement

ఈమె కుక్ విత్ కోమలి కార్యక్రమంలో చేసి మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా కొన్ని సీరియల్ లో కూడా నటించింది.

ఇక ఈమె తాజాగా సినీ రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది.ద్రౌపది సినిమా నుంచి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు మోహన్ జీ. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో మరో కొత్త సినిమా తెరకెక్కనున్నది.రుద్ర తాండవం అనే పేరుతో సినిమాను చేయగా అందులో దర్శా గుప్తా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఇటీవల ఆమె చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో తన అభిమానులను కలిసి వారితో సందడి చేసింది.వారితో కలిసి విందు చేసి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ కాసేపు సందడి చేసింది.

ఇక అక్కడున్న అభిమానులు తనతో కేక్ కట్ చేయించి తనతో కలిసి ఫోటోలు దిగారు.ప్రస్తుతం అభిమానుల తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు