కృతిశెట్టికి ఉప్పెన సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే?

మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి జంటగా డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో ఉప్పెన సినిమా విడుదలైన విషయం తెలిసిందే.

విడుదలైన మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు మరింత ఆదరణ పెరిగింది.

ఇప్పటికే విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుండడంతో ఉప్పెన మూవీ టీమ్ చాలా సంతోషంగా ఉన్నారు.ఇప్పటికే థియేటర్ టూర్స్ ప్లాన్ చేసిన ఉప్పెన టీం థియేటర్స్ కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమాను వీక్షిస్తున్నారు.

అయితే వైష్ణవ్ తేజ్ తరువాత ఈ ఒక్క సినిమాతోనే మూడు, నాలుగు సినిమాలు హిట్ సాధించినంత క్రేజ్ ను కృతి శెట్టి సంపాదించుకుంది.అయితే కృతి శెట్టికి ఉప్పెన సినిమా ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.

అయితే మొదటగా మనీషా అనే నటిని ఒకే చేసిన మూవీ టీమ్ తరువాత బుచ్చిబాబు కృతిశెట్టి ఫోటోలను చూసి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట.దీంతో ఈ విషయాన్ని గురువు డైరెక్టర్ సుకుమార్ కు తెలపడంతో సినిమా గొప్పగా తీయడానికి ఎవరిని తీసుకోవాలనుకుంటే వారిని తీసుకొమ్మని సుకుమార్ చెప్పడంతో బుచ్చిబాబు కృతి శెట్టి సంప్రదించడంతో కృతిశెట్టికి ఉప్పెన సినిమా ఛాన్స్ వచ్చింది.

Advertisement

ఏది ఏమైనా ఉప్పెన సినిమా కుర్రకారులో కృతి శెట్టి తనదైన ముద్ర బలంగా వేసిందనే చెప్పవచ్చు.ఇప్పటికే కృతిశెట్టికి ఆఫర్లు క్యూ కడుతుండడంతో ఇంకా పెద్ద హీరోల సినిమాలలో కూడా ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు