నా బొచ్చుతో నీకేంటి అంటూ దేవేందర్ రెడ్డిపై వైసీపీ ఎంపీ ఫైర్..!

ఏపీ ఐఅండ్‎పీఈర్‎లో డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తన జుట్టు ఎలా ఉంటే ఆయనకు ఎందుకు.

? తన బొచ్చుతో ఏం సంబంధం అని మండిపడ్డారు.గతంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో దేవేందర్ రెడ్డి పనిచేశారని.

ఇప్పుడు డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించిందని అన్నారు.ఆయన పనేదో ఆయన చేసుకోవాలని తన బొచ్చు గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు.

గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నట్టు స్వపక్షంలో విపక్షమంటూ.మాటతో సరిపెట్టుకునే దానికి వేటు దాకా తెచ్చుకున్న రాజుగారి విగ్గు ఊడినట్లేనా.? విగ్గు ఊడిపోతే రేపటి నుంచి ఎలా తిరుగుతారో.? అంటూ తనపై దేవేందర్ రెడ్డి సోషల్ మీడియాలో కామెంట్లు చేశారని రఘురామ కృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.

Advertisement

నువ్వు సరిగ్గా నిలుచుంటే నా బొడ్డు వరకు రావు.నీకు నా జుట్టు ఎలా కనబడిందో తెలియదని అన్నారు.

అందరూ నీలాగే నల్లగా, పొట్టిగా, వికారంగా ఉండాలని నువ్వు కోరుకుంటే దానికి నేనేమి చేయలేనని అన్నారు.నా జుట్టు ఎలా ఉంటే నీకెందుకు.? నా బొచ్చుతో నీకెంటి సంబంధం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ అయినా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దేవేందర్ రెడ్డిని అ పదవి నుంచి తొలగించాలని రఘురామ కృష్ణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

లేని పక్షంలో పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు