ఈ బ్యూటీ క్యాన్సర్‌ను జయించింది.. శిఖరాలను అధిరోహిస్తోంది!

మనీషా కొయిరాలా తెలుసు కదా.90వ దశకంలో తన అందంతో కుర్రకారు మతులు పోగొట్టిన నేపాలీ బ్యూటీ.

అందం, అభినయంతో తనకంటూ అభిమానులను సంపాదించుకుంది.

అయితే 2012లో ఆమెను క్యాన్సర్‌ మహమ్మారి చుట్టుముట్టింది.ఈ ప్రాణాంతక వ్యాధి తనలో ఆందోళన రేపినా.మొండి ధైర్యంతో దానిని జయించింది.

అంతేకాదు ఇప్పుడు ఏకంగా శిఖరాలను అధిరోహిస్తోంది.క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్న సమయంలో తీసిన ఫొటోతోపాటు ఇప్పుడు ఓ పర్వతంపైకి ఎక్కుతున్న ఫొటోలను పోస్ట్‌ చేస్తూ మనీషా ఈ మధ్య ఓ ట్వీట్‌ చేసింది.

తనకు రెండో జీవితాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.ఇదో అద్భుతమైన జీవితం అని, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని మనీషా ఆకాంక్షించింది.

Advertisement

తన ఫ్రెండ్‌ వెడ్డింగ్‌ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగంగా మనీషా రెండు రోజుల పాటు మంచు పర్వతాల్లో విహరించింది.ఈ సందర్భంగానే అక్కడ తాను ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.క్యాన్సర్‌ మహమ్మారి బారి నుంచి బయటపడిన తర్వాత తన అనుభవాలను వివరిస్తూ మనీషా ఓ పుస్తకం కూడా రాసింది.

దాని పేరు "హీల్డ్‌: హౌ క్యాన్సర్‌ గేవ్‌ మి న్యూ లైఫ్‌".

Advertisement

తాజా వార్తలు