టాలీవుడ్‌ రెండవ మాటల మాంత్రికుడుకి బంపర్‌ ఆఫర్‌ ఇవ్వబోతున్న ప్రభాస్‌

టాలీవుడ్‌లో మొదటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.ఈయన తన మాటలతో మాయ చేసి ప్రేక్షకులను రంజింప చేయగలడు.

త్రివిక్రమ్‌ రచయిత నుండి దర్శకుడిగా మారిన విషయం తెల్సిందే.ప్రస్తుతం త్రివిక్రమ్‌ టాలీవుడ్‌ టాప్‌ దర్శకుల్లో ఒకరు.

ఇక గత కొన్ని రోజులుగా తన డైలాగ్స్‌తో మతి పోగొడుతూ తన ప్రతి డైలాగ్‌తో ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తున్న రచయిత సాయి మాధవ్‌ బుర్రా.ఈయన్ను కూడా సినీ వర్గాల వారు ప్రేక్షకులు మాటల మాంత్రికుడు అనే అంటున్నారు.

ఈయన టాలీవుడ్‌కు దొరికిన రెండవ మాటల మాంత్రికుడు అనడంలో సందేహం లేదు.

Advertisement

సాయి మాధవ్‌ బుర్ర కలం నుండి వచ్చిన ఎన్నో అద్బుతమైన డైలాగ్స్‌, లైన్స్‌ సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఫార్వర్డ్‌ మెసేజ్‌లుగా వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే.ఈయన ఇప్పటి వరకు కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఖైదీ నెం.150తో పాటు ఇంకా పలు సినిమాలకు రచయితగా వ్యవహరించాడు.ప్రస్తుతం జక్కన్న భారీ మల్టీస్టారర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ కు కూడా రచయితగా వ్యవహరిస్తున్నాడు.

టాలీవుడ్‌లో రచయితలు దర్శకులుగా మారడం కామన్‌.అలాగే ఇప్పుడు సాయి మాధవ్‌ బుర్రా కూడా దర్శకుడిగా మారేందుకు సిద్దం అయ్యాడు.

సాయి మాధవ్‌కు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తొలి ఛాన్స్‌ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ప్రభాస్‌ సాహో చిత్రాన్ని చేస్తున్నాడు.సాహో చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో జాను అనే చిత్రాన్ని చేస్తున్నాడు.జాను చిత్రం పూర్తి అయిన వెంటనే సాయి మాధవ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ వారు సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!

త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు