తెలుగు ప్రేక్షకుల ముందుకు మరోసారి మ్యాడీ

మణిరత్నం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన మాధవన్‌ చాలా సంవత్సరాలు టాలీవుడ్‌లో నటించకుండా దూరంగా ఉన్నాడు.

తెలుగులో నటించేందుకు మళ్లీ ఇన్నాళ్లకు మాధవన్‌ ఆసక్తి చూపుతున్నాడు.

తెలుగులో మాధవన్‌ నటించిన తాజా చిత్రం ‘సవ్యసాచి’ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.నాగచైతన్య నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే మాధవన్‌కు మంచి రీ ఎంట్రీ దక్కేది.

కాని సవ్యసాచి చిత్రం పెద్దగా ప్రభావం చూపించడంలో విఫలం అయ్యింది.దాంతో మాధవన్‌ వస్తాడా రాడా అంటూ చర్చ జరిగింది.

ఇలాంటి సమయంలోనే మాధవన్‌ మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

Advertisement

మాధవన్‌ తాజాగా రవితేజ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ హీరోగా విఐ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న డిస్కో రాజా చిత్రంలో విలన్‌ పాత్రకు ఓకే చెప్పాడు.అందుకు సంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ సినిమాలో హీరోయిన్స్‌గా ఇప్పటికే పాయల్‌ మరియు ప్రియాంక జవాల్కర్‌లు ఎంపిక అయ్యారు.

గత నెలలోనే సినిమాను విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.ఎట్టకేలకు సినిమా స్క్రిప్ట్‌పై క్లారిటీ రావడంతో వచ్చే నెలలోనే సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో నటీనటుల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతున్నాయి.

త్వరలోనే సినిమాను పట్టాలెక్కించబోతున్న నేపథ్యంలో మాధవన్‌, రవితేజలు ఎలా ఢీ కొట్టబోతున్నారా అంటూ ఆసక్తికరంగా అంతా ఎదురు చూస్తున్నారు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు