ఝార్ఖండ్ లో దారుణ ఘటన,మూడేళ్ళ చిన్నారి పై అఘాయిత్యం,హత్య

ఝార్ఖండ్ లో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది.

మూడేళ్ళ చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అత్యంత దారుణంగా ఆ చిన్నారిని హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టాటా నగర్ రైల్వే స్టేషన్ నుంచి గత గురువారం అపహరణకు గురైన మూడేళ్ళ చిన్నారి పై ఎవరో దుండగులు అత్యాచారానికి పాల్పడడమే కాకుండా అనంతరం ఆ చిన్నారి తల నరికి దారుణంగా హతమార్చారు.

టెల్కో ప్రాంతంలో తల లేకుండా ఉన్న పాప మొండాన్ని పోలీసులు ఒక ప్లాస్టిక్ కవర్లో కనుగొన్నారు.దీనితో మొండాన్ని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించగా విస్తు గిలిపే విషయాలు బయటపడ్డాయి.ఆ చిన్నారిని హత్య చేసే ముందు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసినట్లు వైద్యులు తెలిపారు.

ఈ క్రమంలో ఆ చిన్నారి జననాంగాల వద్ద తీవ్ర రక్తస్రావమైందని తెలిపారు.అయితే బాలిక నిందితులను గుర్తిస్తుందేమో అన్న ఆందోళనతో వారు ఆమెను చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

మరోపక్క బాలిక మిస్ అయిన సమయంలో సీసీ కెమెరా లలో రికార్డ్ అయినా ఫుటేజీ ప్రకారం రింకూ అనే పాత నేరస్తుడు అని గుర్తించిన పోలీసులు అతడి తో పాటు మరో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.గతంలో కూడా రింకూ పై ఇలాంటి అత్యాచార కేసులో చాలానే నమోదు అయినట్లు తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా కూడా జనాల్లో మార్పులు మాత్రం రావడం లేదు.అభం శుభం తెలియని ముక్కు పచ్చలారని చిన్నారులను సైతం కామాంధులు వదలకుండా ఈ విధంగా హత్యా చారాలకు పాల్పడడమే కాకుండా వారిని ఇలా పొట్టనపెట్టుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు