2021 : ఇయర్ ఎండింగ్.. టాలీవుడ్ కు కొత్త ఊపు తెచ్చిన సినిమాలేంటో తెలుసా?

కరోనా తర్వాత పెద్దగా సినిమాలు విడుదల కాలేదు.చిన్నా చితకా సినిమాలు తప్ప భారీ సినిమాల ముచ్చటే లేదు.

స్టార్ హీరోలు అంతగా పోటీ పడలేదు కూడా.అయితే తాజాగా వచ్చిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాయి.

టాలీవుడ్ కు కొత్త ఉత్సాహాన్ని నింపాయి.ఈ మూడు సినిమాల ఊపుతో కొత్త సంవత్సరంలో మరింత జోష్ తో జనాల్లో ఉత్సాహాన్ని నింపేందుకు తెలుగు సినిమా పరిశ్రమ రెడీ అయ్యింది.

ఇంతకీ టాలీవుడ్ కు మళ్లీ ఊపు తెచ్చిన సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.కరోనా తర్వాత కల్లోలంగా మారిన టాలీవుడ్ ను మళ్లీ పైకి లేపిన సినిమాలు క్రాక్, అఖండ, పుష్ప.

Advertisement

రవితేజ-గోపిచంద్​  మలినేని, బాలయ్య-బోయపాటి, అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లలో వచ్చిన ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.అంతేకాదు.

భారీగా వసూళ్లను సాధించాయి.కరోనా సమయంలో జనాలు థియేటర్లకు వస్తారా? అని భయపడుతున్న సమయంలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు టాలీవుడ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.రవితేజ - గోపీచంద్ మలినేని కలిసి చేసిన క్రాక్ సినిమా ఇద్దరి కెరీర్ లో మంచి హిట్ సినిమాగా నిలిచింది.

వరుస ఫ్లాపులతో బాధపడుతున్న రవితేజకు ఈ సినిమా మంచి ఊపును అందించింది.బోయపాటి-బాలయ్య చేసిన అఖండ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది.బాలకృష్ణ ఓ మంచి హిట్ కావాలి అనుకుంటున్న సమయంలో అఖండ వచ్చింది.

వీరిద్దరి కాంబోలో హ్యాట్రిక్ హిట్స్​ వచ్చాయి.ఇక ఈ ఏడాది చివరలో       వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప.

ఒకప్పుడు చదువులో ఫెయిల్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్.. ఈమె సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
ఆ షాట్స్ ను డైరెక్ట్ గా కాపీ కొడతాను.. వైరల్ అవుతున్న జక్కన్న సంచలన వ్యాఖ్యలు!

బన్ని-సుకుమార్ కాంబోలో వచ్చిన మూడో సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వసూళ్లను రాబడుతుంది.మొత్తంగా కోవిడ్ తో కష్టాల్లో కూరుకుపోయిన తెలుగు సినిమా పరిశ్రమను ఈ సినిమాలు మళ్లీ కొత్త ఊపు తెచ్చాయి.

Advertisement

కొత్త సంవత్సరానికి గ్రాండ్ గుడ్ బై చెప్పాయి ఈ సినిమాలు.

తాజా వార్తలు