వైఎస్ఆర్ వర్ధంతి నాడు వైయస్ విజయమ్మ స్పెషల్ కార్యక్రమం..!!

దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వచ్చేనెల 2వ తారీఖు అని అందరికీ తెలుసు.2009 సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన మరణించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ అభిమానులు వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఈసారి వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో చాలా ప్రత్యేకంగా నిర్వహించడానికి రెడీ అయ్యారు.

కార్యక్రమంలో భాగంగా అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పని చేసిన పలువురు నాయకులను విజయమ్మ ఆహ్వానించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం.అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనిరాజకీయం గా కాకుండా ఓ ప్రత్యేక స్పెషల్ కార్యక్రమం గా రూపొందించాలని అనుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో అప్పట్లో వైయస్ తో కలిసి పనిచేసిన మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి వంటి వారిని.ఎప్పటికీ ఆహ్వానించినట్లు అదే రీతిలో వైఎస్ మంత్రివర్గంలో పనిచేసిన మరికొంతమందిని అప్పటి ప్రభుత్వ సలహాదారులను శ్రేయోభిలాషులకు.

విజయమ్మ ఆహ్వానించినట్లు చాలా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఆమె అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

తాజా వార్తలు