వైయస్ షర్మిలకి మద్దతుగా దీక్షలో కూర్చోబోతున్న వైఎస్ విజయమ్మ..!!

YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పాదయాత్రకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పట్ల నిన్నటి నుండి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

నిన్న ట్యాంక్ బండ్ వద్ద దీక్ష చేస్తుండగా పోలీసులు బలవంతంగా.

వైయస్ షర్మిలనీ లోటస్ పాండ్ కి తరలించడం జరిగింది.ఈ క్రమంలో ప్రజాస్వామ్యంలో ప్రజల సాక్షిగా శాంతియుత పోరాటంపై దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి.

అధికార మదంతో, అహంకారంతో వీర్రవీగుతున్న పాలకపక్షానికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.అక్రమ అరెస్టులు ఆగే వరకు, పాదయాత్రకు అనుమతి ఇచ్చేంత వరకు పచ్చి మంచి నీళ్లు తాగకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉంటుంది.

అని షర్మిల ప్రస్తుతం లోటస్ పాండ్ లో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు.ఇదే సమయంలో వైఎస్ఆర్ షర్మిలకు మద్దతుగా దీక్షలో వైయస్ విజయమ్మ కూడా నేడు కూర్చోనున్నారు.

Advertisement

దీంతో షర్మిలకి మద్దతుగా YSRTP కార్యకర్తలు నాయకులు భారీగా లోటస్ పాండ్ కి చేరుకుంటున్నారు. షర్మిల నిరాహార దీక్ష ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు