జెడ్పిటిసి బరిలో యువ నాయకుడు రాజు

రాజన్న సిరిసిల్ల జిల్లా : బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు కొనసాగుతున్న చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన యువ నాయకుడు వేములవాడ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఈర్లపెళ్లి రాజు చందుర్తి మండల జెడ్పిటిసి బరిలో ఉన్నాడు.

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆప్తుడిగా, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడుగా మెదులుకుంటూ బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి అనేక సేవా కార్యక్రమాలు, గ్రామ గ్రామాన యువకులను ఉత్తేజపరిచే టోర్నమెంట్లు నిర్వహిస్తూ మండల ప్రజలతో మమేకమై నేనున్నానని అనే వ్యక్తి రాజు అని మండల ప్రజలు తన సొంత గ్రామమైన మల్యాల గ్రామస్తులు తెలిపారు ఒకటే పార్టీ ఒకటే జెండా కొనసాగుతున్న ఇప్పుడు చందుర్తి జెడ్పిటిసిగా బిఆర్ఎస్ పార్టీ నుండి బరిలో ఈర్లపెళ్లి రాజు ఉన్నాడని మండల నాయకులు వివిధ గ్రామాల ప్రజలు అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తే చందుర్తి మండలం నుండి జెడ్పిటిసిగా పోటీ చేసే అవకాశం ఉందని తన అభిమానులు తెలిపారు.

Latest Rajanna Sircilla News