చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ విపత్తు సమయంలో దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ల సంఖ్య విషయంలో అనుమానాలు ఉన్నాయని, ఈ సమయంలో ఉద్యోగులకు ఎందుకు జీతాలు కట్‌ చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే.

చంద్రబాబు విమర్శలపై నేడు వైకాపా నాయకులు మీడియా సమావేశంలో మండి పడ్డారు.వైకాపా నాయకుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సమయంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ రాజకీయంను ఏమనాలో అర్థం కావడం లేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు పట్టించి వెళ్లి పోయిన చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు.ఆయన కొడుకు ఇంకా తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు ఈ సమయంలో తీవ్రంగా విమర్శలు చేయడం దారుణంగా ఉందని అన్నారు.

తెలుగు దేశం పార్టీ నాయకులు మంచి చేస్తే చేయండి లేదంటే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించి ఇంట్లోనే ఉండండి అంటూ సజ్జల సూచించాడు.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు