ఆచార్యలో చరణ్‌ జోడీపై ఉత్కంఠకు తెర పడే సమయం వచ్చింది

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన సందర్బం రానే వచ్చింది.

మెగా అభిమానులు కలగా ఉన్న చిరు చరణ్ కాంబో మూవీ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది.

ఇన్ని రోజులు చిరు మాత్రమే షూటింగ్‌ లో పాల్గొన్నాడు.ఇటీవలే చరణ్ కూడా జాయిన్ అయ్యాడు.

సిద్ద పాత్రలో చరణ్‌ ఆచార్యలో కనిపించబోతున్నాడు.షూటింగ్‌ లో చరణ్ జాయిన్‌ అయిన నేపథ్యంలో సినిమాపై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.

సినిమాలో చరణ్‌ కు జోడీగా కియారా అద్వానీ నుండి మొదలుకుని రష్మిక మందన్నా వరకు ఎంతో మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి.చివరకు ఆ పేర్లలో ఏ పేరును ఖరారు చేశారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న యూనిట్‌ సభ్యులకు హీరోయిన్‌ విషయంలో ఇంకా సస్పెన్స్‌ గానే ఉందని తెలుస్తోంది.

సినిమాలో చరణ్‌ కు జోడీగా హీరోయిన్ ఉంటుంది.ఆమెకు ఒక పాట కూడా ఉంటుందని అంటున్నారు.త్వరలోనే సినిమా షూటింగ్ కూడా పూర్తి అవ్వబోతుంది అంటున్నారు.

అంటే ఈ ఒకటి రెండు రోజుల్లోనే ఆచార్యలో మరో హీరోయిన్‌ జాయిన్ అవ్వాలి.అది కూడా చరణ్‌ తో జత కట్టాల్సి ఉంటుంది.

కనుక ఇప్పటికే ఒక హీరోయిన్‌ పేరును కొరటాల అనుకోవడం ఆమెను ఫిక్స్‌ చేయడం జరిగి ఉంటుంది.కాని ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం చెప్పడం లేదు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

సినిమా విడుదల అయ్యే వరకు అయినా ఆ విషయాన్ని చెబుతారా లేదా అనేది క్లారిటీ లేదు.రష్మిక మందన్నా ప్రస్తుతం చాలా బిజీగా ఉండటంతో పాటు చాలా ఎక్కువ పారితోషికం అడుగుతుంది.

Advertisement

ఇక కియారా అద్వానీ బాలీవుడ్‌ లో చాలా బిజీ అయ్యింది.కనుక ఆమెను కూడా ఈసినిమా లో నటింపజేయడం కష్టంగా ఉంది.

మరి చివరకు ఎవరిని ఈ సినిమాకు ఎంపిక చేశారు చరణ్‌ తో స్టెప్పులు వేసిది ఎవరు అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

తాజా వార్తలు