ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy )అన్నారు.జిల్లాలో నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు.
బ్రాహ్మణ వెల్లంల, ఎస్ఎస్బీసీ, డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు.మూడు నెలల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నీరు విడుదల చేస్తామన్నారు.
మొదటి విడతలో 60 వేల ఎకరాలకు నీరు అందిస్తామని వెల్లడించారు.తమది ప్రజా ప్రభుత్వమన్న ఆయన ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తామని స్పష్టం చేశారు.