మూడు నెలల్లో జగన్ తప్పులను సరి చేస్తాం..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు.

స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని నిర్వీర్యం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు.అత్యాశ, అసూయతో సీఎం జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాలతో భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు.

అధికారంలోకి రాగానే మూడు నెలల్లో జగన్ చేసిన తప్పులను సరి చేస్తామని పేర్కొన్నారు.మూడు నెలల తరువాత రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బాహుబలి 3 రాబోతోందా.. హింట్ ఇచ్చిన నిర్మాత.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్!
Advertisement

తాజా వార్తలు