ఓటరు దర్శకుడుని భయపెట్టిన మంచు విష్ణు! డైరెక్టర్ అసోసియేషన్ కి ఫిర్యాదు

మంచు విష్ణు హీరోగా చివరిగా వచ్చిన చిత్రం ఆచారి అమెరికా యాత్ర.ఆ సినిమా విష్ణు కెరియర్ లో మరో ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది.

ఇండస్ట్రీలో హిట్స్ కంటే ఫ్లప్స్ ఎక్కువ ఉన్న హీరోల జాబితాలో మంచు హీరోలు ముందు వరుసలో ఉంటారు.వారి దురదృష్టం ఎలా ఉందో తెలియదు కాని ఏ సినిమా కూడా థియేటర్స్ లో వారు హీరోలుగా చేసిన సినిమాలు మెప్పించలేదు.

అయితే నటులుగా తమ సత్తా నిరూపించుకున్న హీరోలు గా నిలబడటానికి మాత్రం అవస్థలు పడుతున్నారు.అయితే ఇండస్టీలో మంచు ఫ్యామిలీ మీద ఎక్కువగా వినిపించే కామెంట్ అన్నింట్లో వేలు పెట్టి ఇష్టానుసారంగా మార్చేసుకుంటారు అని.తాజాగా మంచు విష్ణు మీద ఫిర్యాదు చేసి ఓ దర్శకుడు తెరమున్దుకి వచ్చాడు.ప్రస్తుతం మంచు విష్ణుతో ఓటర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్న కార్తిక్ రెడ్డి ఈ సినిమా విషయంలో మంచు విష్ణు తనని బెదిరిస్తున్నాడని దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేసాడు.

సినిమా కథని ఇష్టానుసారంగా మార్చేసి వేలు పెట్టి నాశనం చేసాడని, ఇక సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న టైంలో సినిమా కథ, స్క్రీన్న్ ప్లే క్రెడిట్ తనకి ఇవ్వాలని, ఓటర్ సినిమాని మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ స్పూర్తిగా రాసుకున్నట్లు బాండ్ మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నాడని ఆరోపించాడు.అతని వలన తనకి ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో తెలియజేసారు.

Advertisement

ఓటర్ సినిమా విషయంలో మంచు విష్ణు, కార్తిక్ రెడ్డి గొడవ ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు