వైరల్ వీడియో : కారును ఇలా కూడా నడపవచ్చా ..!?

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఇద్దరు భారతీయులు ఒక డొక్కు కారు ని నడిపే విధానానికి ఫిదా అయిపోయారు.

వాళ్ళిద్దరూ కారు నడుపుతున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.

చూడ్డానికి ఇది పాత వీడియో లాగా కనిపిస్తుంది కానీ ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది.మా భారతీయులు కార్లను రథం తో ఎందుకు పోల్చుతారో ఇప్పుడు మీరు చూడొచ్చు.

కార్లను తోలేటప్పుడు కచ్చితంగా మీరు తాడుని చేతిలో పట్టుకోవడం మర్చిపోకండి అని సరదాగా పేర్కొన్నారు.అయితే 2 నిముషాల 10 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు తమ కారు ని రిపేరు చేయడం చూడొచ్చు.

ఇంజన్ కి ఒక తాడు కట్టి స్టార్ట్ చేయడం కూడా చూడొచ్చు.అయితే ఈ కారులో యాక్సిలరేషన్ ఇవ్వడానికి ఎక్సలేటర్ కూడా లేదు.

Advertisement

దీంతో వారు యాక్సిలరేషన్ ఇవ్వడానికి కారు ముందు భాగం లో ఒక వైరు కట్టారు.ఆ తర్వాత ఒక వ్యక్తి కారు వెనుక భాగంలో నిల్చొని తాడును లాగుతూ కారు వేగాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.

లోపల కూర్చున్న మరో వ్యక్తి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కారు ముందుకు పోనిచ్చాడు.ఎక్సలేటర్ లేకపోయినా తమ తెలివితో ఈ ఇద్దరు వ్యక్తులు అప్పటికప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి కారును స్టార్ట్ చేసి ముందుకు నడిపించగలిగారు.

అయితే వారి సృజనాత్మకతకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.ఈ వీడియో ని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి వారిని అభినందించారు.

అయితే ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన ఈ ఓల్డ్ వీడియో మళ్లీ తెగ వైరల్ అవుతోంది.వీడియాలో కనిపించిన ఇద్దరి వ్యక్తుల ఐడియాకు చాలా మంది నెటిజన్లు ఫిదా అవుతున్నారు.వీళ్ళు రథసారథులు అని మరికొంత మంది నెటిజన్లు బిరుదులు కూడా ఇస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రశాంత్ మూవీకి ఆ టైటిల్ ను ఫిక్స్ చేయడం కష్టమే.. ఆ కష్టాన్ని అధిగమిస్తారా?
చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు..!!

ఏదిఏమైనా ఆనంద మహేంద్ర ని ఆశ్చర్యపోయేలా చేసిన ఈ ఇద్దరు వ్యక్తులు నిజంగా గ్రేట్.

Advertisement

తాజా వార్తలు