ఆ వింత రోగంతో బాధ పడుతున్న యాంకర్ వర్షిణి..?

మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి ఢీ ఛాంపియన్స్ షో ద్వారా యాంకర్ గా గుర్తింపు తెచ్చింది వర్షిణి.

కొని తెలుగు సినిమాల్లో నటించినా బుల్లితెరపై చేసిన షోలే వర్షిణికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

టీవీ షోలలో పద్ధతిగా కనిపించినా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వర్షిణి సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకుంటోంది.అయితే వర్షిణి ఒక వింత రోగంతో బాధ పడుతుందని ఆమె అక్క సౌజన్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

యాంకర్ రవి యూట్యూబ్ ఛానల్ కు వర్షిణి ఆమె సోదరితో కలిసి హాజరయ్యారు.వర్షిణి యాంకర్ గా చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఆమె సోదరితో కలిసి ఎప్పుడూ కనిపించలేదు.

రవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌజన్య వర్షిణి రహస్యాలను చెబుతూ ఆమె పరువును గంగలో కలిపేసింది.దీపావళి స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా గెస్ట్ లుగా వీళ్లు హాజరయ్యారు.

Advertisement

ఈ ఇంటర్వ్యూలో సౌజన్య వర్షిణికి నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పింది.

ఒకసారి రైలులో ప్రయాణిస్తున్న్ సమయంలో రైలు ఒక స్టేషన్ లో ఆగిందని.ఆ సమయంలో వర్షిణి రైలు నుంచి దిగిపోయిందని దీంతో కంగారు పడ్డామని వర్షిణికి ఉన్న వింత రోగం గురించి బయటపెట్టారు.విజయవాడకు వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు జరిగిందని అన్నారు.

ఆ తరువాత హైపర్ ఆదికి సౌజన్య ఫ్రాంక్ కాల్ చేయగా హైపర్ ఆది రివర్స్ లో సౌజన్యను బెదరగొట్టాడు.గత కొన్ని వారాల నుంచి వర్షిణి హైపర్ ఆది మధ్య ఏదో ఉందని గాసిప్స్ వైరల్ అవుతుండటంతో వర్షిణితో అలా చేస్తే ఎలా.? అంటూ సీరియస్ గా మాట్లాడే ప్రయత్నం చేయగా హైపర్ ఆది మీ చెల్లి వేసే చీమ ఏనుగు జోకులను మేము కూడా భరించలేక పోతున్నామంటూ కౌంటర్లు చేశారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు