వంశీ కి షాక్ ! సస్పెన్షన్ వేటు వేసిన టీడీపీ

గన్నవరం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ పై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

తెలుగుదేశం పార్టీ మీద, అధినాయకుడు చంద్రబాబు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో పాటు తమ రాజకీయ ప్రత్యర్థి సీఎం జగన్ ను కలవడంపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతే కాకుండా చంద్రబాబు చేపట్టిన ఇసుక దీక్షను సైతం వంశీ అవహేళన చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడమైనా ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.తగా ఈ రోజు ఉదయం పార్టీ కీలక నాయకులతో తాజా పరిణామాలమీద చర్చించిన చంద్రబాబు వంశీ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తే మరికొందరు ఇదే బాటలో పయనించి పార్టీకి చేటు తీసుకువస్తారని, క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీ ఉండాలి అంటే వేటు వేయడమే కరెక్ట్ అనే అభిప్రాయానికి రావడంతో వంశీ పై వేటు పడినట్టు తెలుస్తోంది.

వంశీ టిడిపిలోనే ఉంటూ జగన్ కు మద్దతుగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు బహిరంగంగానే చెప్పేయడం బాబు కు బాగా ఆగ్రహం తెప్పించిందట.

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు