వి ఎఫెక్ట్ తో ఇంద్రగంటిని పక్కన పెట్టిన విజయ్ దేవరకొండ

వరుస హిట్ సినిమాలతో మంచి సక్సెస్ ఫుల్ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ కెరియర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా వి మూవీ నిలిచింది.

థ్రిల్లర్ జోనర్ లో ప్రేక్షకులకి కొత్తగా వినోదాన్ని అందించాలనే ప్రయత్నంలో పాత కథనే చెబుతున్నామన్న విషయాన్ని దర్శకుడు ఇంద్రగంటి మరిచిపోయాడని వి సినిమా చూసాక ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన.

ఈ సినిమాలో హీరోలుగా నాని, సుధీర్ బాబు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.ఇక హీరోయిన్ పాత్రలు రెండూ సినిమాలో కీలకంగా ఉంటాయని చెప్పిన అవి పూర్తిగా తేలిపోయాయి.

కథలో దమ్ము లేకపోవడంతో కథనం వీక్ అయిపొయింది.జెంటిల్మెన్ లాంటి థ్రిల్లర్ తీసిన ఇంద్రగంటి ఇలాంటి సినిమా తీసాడంటే అస్సలు నమ్మలేని నిజంగా ఉంది.

అయితే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయడం వలన దిల్ రాజు బాగా సేఫ్ అయ్యి కొంత లాభాలతో బయటపడ్డాడు.అదే థియేటర్ లో రిలీజ్ చేసి ఉంటే మొదటి, రెండు రోజులకె సినిమా రిజల్ట్ బట్టి కలెక్షన్స్ పూర్తిగా పడిపోయేవని, భారీ నష్టం జరిగేదని ఈ విషయంలో దిల్ రాజు ఓటీటీ ప్లాన్ అతనికి బాగా వర్క్ అవుట్ అయ్యిందని సినీ విమర్శకుల మాట.ఇదిలా ఉంటే వి సినిమా కంటే ముందుగానే ఇంద్రగంటి విజయ్ దేవరకొండతో ఒక సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు.ఈ సినిమాని దిల్ రాజు నిర్మించడానికి రెడీ అయ్యాడు.

Advertisement

అది కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.అయితే వి రిజల్ట్ తర్వాత దిల్ రాజు కొంత ఆలోచనలో పడ్డారని, అలాగే విజయ్ దేవరకొండ కూడా తనకున్న కమిట్మెంట్ లని ముందుకి తీసుకొచ్చి ఇంద్రగంటిని హోల్డ్ లో పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.

విజయ్ ప్రస్తుతం పూరీతో చేస్తున్న ఫైటర్ పూర్తి చేసి తరువాత ఒక హిందీ సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఆ తరువాత అవకాశాన్ని బట్టి ఇంద్రగంటి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

మొత్తానికి వి సినిమా ఎఫెక్ట్ కారణంగా ఇంద్రగంటి రెండో సినిమాకి నిరీక్షణ తప్పేలా లేదు.అయితే ఈ లోపు వెబ్ సిరీస్ ప్లాన్ లో ఈ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు