షార్ట్ ఫిలిం దర్శకుడుకి అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్

ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తమని తాము ప్రూవ్ చేసుకొని పెద్ద సినిమా అవకాశాలు అందుకుంటున్నారు.

ప్రభాస్ తో సాహో తీసిన సుజిత్ కూడా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రూవ్ చేసుకున్నవాడే.

ఈ దారిలోనే తరుణ భాస్కర్, వివేక్ ఆత్రేయ, ప్రశాంత్ వర్మ లాంటి యూనిట్ టాలెంట్ చాలా మంది ఉన్నారు.తమలోని క్రియేటివ్ థాట్స్ ని బయటకి తీస్తూ కొత్తదనం ఉన్న కంటెంట్ లతో సత్తా చాటుతున్న ఈ దర్శకులు చాలా వేగంగా అవకాశాలు అందుకుంటున్నారు.

ఇక కొత్త దర్శకులని పరిచయం చేయడంలో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.సుజిత్ ని రన్ రాజా రన్ తో వెండితెరకి పరిచయం చేసింది ఈ నిర్మాతలే అనిసంగతి అందరికి తెలిసిందే.

ఇక ఇప్పుడు మరో యంగ్ టాలెంటెడ్ దర్శకుడుని వెండితెరకి పరిచయం చేయడానికి యూవీ క్రియేషన్స్ వారు సిద్ధమయ్యారు.మనసానమః అనే షార్ట్ ఫిలిం ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించింది.

Advertisement

అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన ఈ షార్ట్ ఫిలింకి దీపక్ దర్శకత్వం వహించాడు.కాలాలకు అనుగుణంగా మారే పరిస్థితులని ఒక కుర్రాడు ప్రేమలో ఉన్నప్పుడు అనుభవించే భావోద్వేగాలకు ముడి పెడుతూ ఇప్పటితరం ప్రేమని, ప్రేమకథలను చక్కగా తెరకిక్కించడంలో దీపక్ అందరిని మెప్పించాడు.

అందుకే గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి స్టార్ డైరెక్టర్ మనసానమఃను తమిళంలో డబ్ చేసి తన నిర్మాణ సంస్ధ ద్వారా విడుదల చేశారు.గౌతమ్ మీనన్ ని మెప్పించిన దీపక్ ని యూవీ క్రియేషన్స్ సంస్థ దర్శకుడుగా పరిచయం చేయబోతుంది.

అతను తీసిన షార్ట్ ఫిలిం చూసిన యూవీ వారు దీపక్ మీద నమ్మకంతో సినిమా చేయడానికి ముందుకొచ్చారని తెలుస్తోంది.రాధేశ్యామ్ తర్వాత తక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...
Advertisement

తాజా వార్తలు