ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ట్విస్ట్..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.

కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కానీ నిందితులు ఇప్పటివరకు విడుదల కాలేదని సమాచారం.రూ.3 లక్షల రెండు పర్సనల్ బాండ్స్ సమకూర్చలేక లాయర్లు తంటాలు పడుతున్నారు.మరోవైపు నందకుమార్ పై బంజారాహిల్స్ లో పెండింగ్ కేసు ఉన్న సంగతి తెలిసిందే.

కాగా నందకుమార్ బెయిల్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించనుంది.అదేవిధంగా హైకోర్టులో జగ్గుస్వామి క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.41 (ఏ) సీఆర్పీసీ, లుకౌట్ నోటీసులు కొట్టివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రలోభాల కేసుతో తనకు సంబంధం లేదని జగ్గుస్వామి తెలిపారు.

సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మ్యానిఫెస్టో.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు