దొంగ స్వామీ గుట్టురట్టు చేస్తోన్న త్రివిక్రమ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ చిత్రాన్ని ఓకే చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాలని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భావించాడు.కానీ ఎందుకో ఈ కాంబోలో సినిమా పట్టాలెక్కలేదు.

దీంతో ఇప్పుడు మరోసారి చిరంజీవితో త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.అయితే ఈసారి చిరంజీవి కోసం ఓ క్రైమ్ డ్రామా కథను త్రివిక్రమ్ రెడీ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ కథలో ఓ దొంగ స్వామీజీ బండారం ఎలా బట్టబయలు అయ్యిందనేది చాలా ఆసక్తిగా చూపించనున్నాడట త్రివిక్రమ్.కాగా ఈ కథ చిరుకు బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాతో బిజీగా ఉండటం, అటు త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉండటంతో, ఈ ఇద్దరు కలిసి సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా చిరు-త్రివిక్రమ్ కాంబోలో ఖచ్చితంగా సినిమా ఉంటుందని, అది అతిత్వరలో పట్టాలెక్కడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి ఈ మెగా ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.ఏదేమైనా ఈ కాంబోలో సినిమా వస్తే అది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

విశ్వంభర సినిమా నుంచి టీజర్ వచ్చేది అప్పుడేనా..?
Advertisement

తాజా వార్తలు