తెలంగాణ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ సభలో కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఐడియాలజీ లేదని చెప్పారు.
రాష్ట్రంలో బీజేపీని బీఆర్ఎస్ పార్టీ ఓడిస్తుందంటే పర్వాలేదు కానీ ఒక్క ఎంపీ కూడా లేని ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని ఎలా ఓడిస్తుందని ప్రశ్నించారు.ఖమ్మం సభకు కేసీఆర్ మిత్రుడు ఎంఐఎంను ఎందుకు పిలవలేదో చెప్పాలన్నారు.
మాజీమంత్రి పొంగులేటిని తమ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎప్పుడో ఆహ్వానించారని తెలిపారు.అదేవిధంగా షర్మిల పార్టీని ఎన్జీవో ఆర్గనైజేషన్ గానే చూస్తానని పేర్కొన్నారు.