టాలీవుడ్ టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల లిస్ట్ ఇదే?

ఒకప్పుడు హీరోలకు మాత్రమే టాప్ రెమ్యూనరేషన్ ఉండేది.

కానీ ఇటీవల కాలంలో హీరోయిన్లు సైతం సినిమా హిట్టు వచ్చింది అంటే చాలు రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలా అంటూ భారీ గా పెంచేస్తున్నారు.

ఇక హీరోయిన్ ను పెంచేస్తున్న రేటుతో అటు నిర్మాతలకు వణుకు పుడుతుంది అని చెప్పాలి.అంతలా రెమ్యూనరేషన్ తో భయపడుతున్నారు నేటి రోజుల్లో హీరోయిన్లు.

ఇలా రెమ్యునరేషన్ పెంచిన హీరోయిన్ల లిస్టు ఇప్పుడు తెలుసుకుందాం.

నయనతార:

సౌత్ ఇండస్ట్రీ లో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార పారితోషకం విషయంలో కూడా టాప్లో కొనసాగుతోంది.ఇక ఒక్కో సినిమాకి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుంది.

అంతేకాదండోయ్ ప్రచారానికి కూడా దూరంగా ఉంటాను అంటూ ముందే చెప్పేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

అనుష్క శెట్టి:

నయనతార తర్వాత ఆ రేంజిలో పారితోషికం అందుకుంటున్న అనుష్క ప్రస్తుతం సౌత్ లో సీనియర్ హీరోయిన్ గా ముద్రపడినప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.ఎంతోమంది దర్శకులు ప్రత్యేకంగా అనుష్క కోసమే కథలు రాసుకుంటున్నారు.

Advertisement

ఒక సినిమాకి మూడు కోట్ల పారితోషికం తీసుకుంటుంది.

సమంత:

పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సమంత ఎక్కడ తగ్గేదేలే లేదు అని అంటుంది.ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అదరగొడుతోంది.

ఒక సినిమాకి మూడు కోట్లు డిమాండ్ చేస్తోందట ఈ ముద్దుగుమ్మ.

పూజా హెగ్డే:

ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే.ఒక్కో సినిమాకి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.అయినప్పటికీ నిర్మాతలు మాత్రం ఈ అమ్మడు డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.

రష్మిక మందన్న:

చలో సినిమా తో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన ఒక్కో సినిమాకి 2.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ ఉంది.పుష్ప సినిమా హిట్ తర్వాత మరింత పెంచనున్నట్లు తెలుస్తోంది.

కీర్తి సురేష్:

అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన మహానటి గా మారిపోయింది కీర్తి సురేష్.ఇక ఒక్కో సినిమాకి రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్:

సీనియర్ హీరోయిన్ గా ముద్రపడిన కాజల్ కి అవకాశాలు మాత్రం తగ్గలేదు.దీంతో తన క్రేజ్ కు తగ్గట్టుగానే ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ చందమామ.

త‌మ‌న్నా:

మొన్నటి వరకు ఎక్కువ పారితోషికం తీసుకున్న తమన్నా ఇప్పుడు మాత్రం కేవలం 75 లక్షలు మాత్రమే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది

కియారా అద్వానీ:

ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను వరుస సినిమాలతో పలకరిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకు డిమాండ్ చేస్తుందట.

Advertisement

రాశీ ఖ‌న్నా:

ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేసినా రాశికన్నా సరైన స్టార్ డమ్ మాత్రం సంపాదించుకోలేక పోయింది.రాశి కన్నా ఒక్కో సినిమాకి 60 లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ర‌కుల్ ప్రీత్ సింగ్:

మొన్నటి వరకు సౌత్ లో ప్రస్తుతం నార్త్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటున్న రకుల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 70 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సాయి పల్ల‌వి:

ప్రస్తుతం వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన సాయిపల్లవి ఒక సినిమాకి 1.50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.

తాజా వార్తలు