తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "143" అనే చిత్రంలో హీరోగా నటించి సినిమా పరిశ్రమకి నటుడిగా పరిచయం అయిన టాలీవుడ్ హీరో "సాయిరాం శంకర్" గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే సాయిరాం శంకర్ హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడని కూడా చాలా మందికి తెలుసు.
సాయిరాం శంకర్ సినిమా పరిశ్రమకి వచ్చిన మొదట్లో బద్రి, ఇడియట్, బాచి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, తదితర చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పనిచేశాడు.ఆ తర్వాత తన అన్నయ్య దర్శకత్వంలో వచ్చిన "143" అనే చిత్రంలో హీరోగా నటించి వచ్చీ రావడం తోనే సక్సెస్ ని అందుకున్నాడు.
ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.కాగా తాజాగా హీరో సాయిరాం శంకర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తమ అన్నదమ్ముల అనుబంధం విషయం గురించి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాథ్ తనని హీరోగా నిబెలట్టేందుకు చాలా చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు.ఈ మధ్య కాలంలో డబ్బు విషయంలో సొంత అన్న దమ్ములయినా సరే అప్పుడప్పుడు గొడవ పడడం నేను చాలా చూశానని కానీ తమ మధ్య ఇప్పటి వరకూ ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేవని ఇకముందు కూడా రావని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
అలాగే ప్రస్తుతం సినిమా మార్కెట్లో పూరి జగన్నాథ్ కి మంచి డిమాండ్ ఉందని, కానీ నేను ఆయన చిత్రంలో నటించడం వల్ల ఆ పాత్రకి న్యాయం చేయలేక పోతే కొంతమేర సినిమా దెబ్బతినే అవకాశం ఉందని, అందువల్లనే ఈ మధ్య కాలంలో తాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలలో నటించ లేదని స్పష్టం చేశాడు.కానీ ఇప్పటికీ చాలా మంది అవకాశాల కోసం తన అన్న ని అడగమని సలహాలు ఇస్తుంటారని, కానీ తన చిత్రంలో తన పాత్రకి సరిపోయే అవకాశం ఉంటే కచ్చితంగా పూరి జగన్నాథ్ పిలిచి అవకాశం ఇస్తాడని అందులో ఎలాంటి సందేహం లేదని తెలిపాడు.
అంతేగాక తాను సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి పూరి జగన్నాథ్ చేయవలసిన సహాయం ఇప్పటికే చాలా చేసాడని ఇకపై తాను సొంతంగా తన ప్రతిభను నిరూపించుకుని అవకాశాలను దక్కించుకోవాలనుకుంటున్నాని తన మనసులోని మాటని బయట పెట్టాడు.ఇక తన భవిష్యత్తు సినిమాల గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతం తాను తెలుగులో "వాడు నేను కాదు" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు తెలిపాడు.
ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం తదితర భాషలలో కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ చిత్రంలో సాయి రామ్ శంకర్ మత్తు పదార్థాలకు బానిసయిన ఓ యువకుడి పాత్రలో మరియు న్యాయం కోసం పోరాటం చేసేటువంటి లాయర్ పాత్రలో కనిపించనున్నానని చెప్పుకొచ్చాడు.
అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 80 శాతం చిత్రీకరణ పనులు పూర్తయ్యాయని కానీ చిన్న సమస్య కారణంగా కొంతకాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేశామని తెలిపాడు.అలాగే చిత్రంగా ఈ చిత్రం తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే సాయిరామ్ "జగదాంబ" అనే మరో చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy