ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన శివగామి

తెలుగు బిగ్ బాస్ చాలా రొటీన్ గా, బోరింగ్ గా సాగుతున్న ఈ సమయంలో ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ రెండు రోజుల పాటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసింది.

నాగార్జున కంటే కూడా అధికంగా రమ్య కృష్ణ ఆకట్టుకుంటుందంటూ టాక్ వచ్చింది.

నాగ్ దయచేసి మరో కొన్ని రోజులు అక్కడే ఉండాలని బిగ్ బాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.శివగామి గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన రమ్య తన మాట శాశనం అన్నట్లుగా హోస్టింగ్ చేసింది.

ఇంటి సభ్యలతో ఆమె ఆడిన ఆటలు, పాడిన పాటలు, చేసిన సందడి అంతా ఇంతా కాదు.సౌత్ లో మొదటి సారి బిగ్ బాస్ కు హోస్ట్ చేసిన ఘనత ఈమెకు దక్కింది.ప్రతి మూమెంట్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఈమె హోస్టింగ్ ఉండనడంలో ఎలాంటి అనుమానం అయితే లేదు.

మొదటి రోజు రాయల్ లుక్ లో వచ్చిన రమ్య కృష్ణ రెండవ రోజు మోడ్రన్ లుక్ లో వచ్చింది.

Advertisement

ఇక ఇంటి సభ్యులను సర్ఫరైజ్ చేస్తూ ఇంట్లోకి వెళ్లిన ఈ అమ్మడు అక్కడ చేసిన హంగామా మరింత ఆకర్షణీయంగా ఉంది.ఇంత సందడి జరుగుతున్నా ఎలిమినేషన్ లో ఉన్న మహేష్ విత్త, పునర్నవి, హిమజలు మాత్రం చాలా టెన్షన్ గా ఉన్నారు.వారి ముగ్గురిలో ఎవరు ఎలిమినెట్ అవుతారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

కానీ షాకింగా ఈ వారం ఎలిమినేషన్ లేదని చెప్పి నామినేషన్స్ లో ఉన్న వారికి స్వీట్ షాక్ ఇచ్చింది.ఈ వారం వైల్ కార్డు ఎంట్రీ ద్వారా శిల్ప చక్రవర్తి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు