రాజకీయ బడిలో తొలి గురువు ఆయనే.. కుష్బూ కామెంట్స్ వైరల్!

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని( Teachers day )ఎంతో ఘనంగా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రతి ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఇకపోతే రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ తొలి గురువుల గురించి స్మరించుకుంటూ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నటి కుష్బూ ( Kushboo ) సైతం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Teachersday Special Kushboo Tweet Goes Viral In Social Media, Kushboo, Politic

కుష్బూ సినీనటి గా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈమె మొదట 2010లో ఖుష్బూ కరుణానిధి సమక్షంలో డీఎంకే( DMK) సభ్యత్వం పొంది రాజకీయ ప్రవేశం( Political Entry ) చేశారు.ఆ తర్వాత 2014లో డీఎంకే నుండి వైదొలగి, కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు.

ఇలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఈమె తిరిగి 2020 అక్టోబర్‌లో బీజేపీ( BJP )లో చేరారు.ప్రస్తుతం ఖుష్బూ బీజేపీ(BJP)లో జాతీయ కమిటీ సభ్యురాలిగా, మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు.

Teachersday Special Kushboo Tweet Goes Viral In Social Media, Kushboo, Politic
Advertisement
Teachersday Special Kushboo Tweet Goes Viral In Social Media, Kushboo, Politic

ఇకపోతే సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే సందర్భంగా ఈమె తన రాజకీయ గురువు గురించి ప్రస్తావనకు తీసుకువస్తూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.తన రాజకీయ తొలిగురువు కలైంజర్‌ను స్మరిస్తూ ట్వీట్‌ చేశారు.నా రాజకీయ బడిలో తొలి గురువు అంటూ కరుణానిధి ( Karunanidhi ) తో కలిసి ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కుష్బూ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు