నిందితులను పట్టుకోలేక జగన్ కాళ్ళు పట్టుకుంటున్నాడు

ఏపీలో దేవాలయాలపై దాడులు, విగ్రహా ద్వంసం ఘటనలపై ప్రతిపక్ష, విపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే టి‌డి‌పి ఎం‌ఎల్‌సి మంతెన సత్యనారాయణ జగన్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆలయాలపై దాడులు చేసినవారిని పట్టుకునే చేతకాక జగన్ కాళ్ళు పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశాడు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడానికి జగన్ కు అర్హత లేదని ఆయన హిందూ మతాన్ని ఉద్దరిస్తున్నట్లుగా మహా బాగా నటిస్తున్నాడని మంతెన అన్నాడు.150 ఆలయాలపై దాడులు జరిగితే వైసీపీ ప్రభుత్వం మాత్రం విచారణకు ఆదేశించలేదని అన్నాడు.పోలీసు ల కంటే ముందే జగన్ ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ ఆలయాలపై దాడులను ప్రతిపక్ష నాయకులపై నెట్టేస్తున్నారు.

వాళ్లపై కేసులు పెట్టి వారిని భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నాడు.టి‌డి‌పి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు రామ తీర్థంలోని రాముడి విగ్రహం పునర్ ప్రతిష్టకు విరాళాన్ని అందిస్తే ఆ విరాళాన్ని వెనక్కి పంపి ఆయన ను అవమానించారు.

ఇలా విరాళాన్ని వెనక్కి పంపడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని మంతెన సత్యనారాయణ అన్నాడు.

Advertisement
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

తాజా వార్తలు