రాధేశ్యామ్‌లో ఆ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కాగా ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.కాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, వాటికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన విషయం తెలిసిందే.

ఈ పోస్టర్స్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక అందాల భామ పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో అదిరిపోయే లుక్‌లో మనకు కనిపించింది.

అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌లో ఈ సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు అనే అంశంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు.దీంతో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం సస్పెన్స్‌గా మారిపోయింది.

Advertisement

కానీ ఇప్పటివరకు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఈ సినిమా కోసం ఎవరిని తీసుకుంటారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

మరి ఈ సినిమాకు సంగీతం ఎవరి ఇస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు