సుశాంత్ ఫ్యాన్స్ కి టార్గెట్ అయిన మరో నటి

బాలీవుడ్ లో ఇప్పుడు సుశాంత్ ఫ్యాన్స్ భయం చాలా మందికి పట్టుకుంది.

సుశాంత్ ఆత్మహత్యకి బాలీవుడ్ లో స్టార్ కిడ్స్, బడా స్టార్స్ కారణమని బలంగా నమ్ముతున్న ఫ్యాన్స్ వారికి సంబందించిన సినిమాలు వచ్చిన, లేదంటే వారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టిన విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

స్టార్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఎవరిని వదలడం లేదు.తాజాగా మహేష్ భట్ ఫామిలీ నుంచి వచ్చిన సడక్ 2 మూవీపై సుశాంత్ ఫ్యాన్స్ ఆగ్రహం పెల్లుబికింది.

దీంతో ఇది వరకు ఏ సినిమాకి రాని విధంగా మిలియన్స్ లో డిజ్ లైక్స్ వచ్చాయి.ఇక సినిమా రిలీజ్ మీద కూడా సుశాంత్ ఫ్యాన్స్ ప్రభావం కనిపించింది.

అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి ఈ సినిమా రీచ్ కాలేదని తెలుస్తుంది.ఇదిలా ఉంటే మరో యంగ్ హీరోయిన్ ని సుశాంత్ ఫ్యాన్స్ ఇప్పుడు టార్గెట్ చేశారు.

Advertisement

మొన్నటికి మొన్న జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనాపై తీవ్రంగా ఎటాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు అనన్య పాండే నటించిన ఖాలీ పీలీ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో డిస్ లైక్స్ బారిన పడేటట్లు చేసారు.మా అమ్మాయి స్టార్ కిడ్ కాదు.

నేను స్టార్‌ని కాదు అని అనన్య పాండే తండ్రి చుంకీ పాండే చెప్పినా కూడా సుశాంత్ అభిమానులు మాత్రం అనన్య సినిమాకి తిరిగి బొమ్మ చూపించడానికి రెడీ అయ్యారు.ఇకపై జాన్వీ, అలియా, సోనాక్షి, సారా, అనన్య ఇలా ఎవరి సినిమాలు రిలీజ్ అయినా కూడా వారికి సుశాంత్ ఫ్యాన్స్ నుంచి మాత్రం ట్రోల్స్ తప్పేలా లేవు.

ఇక ఈ సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది.ఈ కేసు మొత్తం రియా చుట్టూనే తిరుగుతుంది.

దాంతో ఆమె ఇందులో ప్రధాన ముద్దాయి అనే తేలేంత వరకు ఈ సుశాంత్ అభిమానుల ఆగ్రహానికి స్టార్ కిడ్స్ గురికాకతప్పదు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు