సురేందర్ రెడ్డికి ఒకే చెప్పిన ఇస్మార్ట్ రామ్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరియర్ లో సాలిడ్ హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం రెడ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ చివరిదశకి వచ్చేసింది.

లాక్ డౌన్ కారణంగా కొంత పెండింగ్ ఉంది.ఇక ఈ సినిమాలో రామ్ మొదటి సారి కెరియర్ లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

ఇక తమిళ సినిమాకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది.దీంతో దీని మీద భారీగానే అంచనాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తాడు అనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తుంది.

ఇప్పుడు తెరపైకి సురేందర్ రెడ్డి పేరు వచ్చింది.మెగా కాంపౌండ్ లోకి వెళ్లి రేసుగుర్రం, ధృవ, సైరా నరసింహారెడ్డి లాంటి మూడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ దర్శకుడుగా మారిన సురేందర్ రెడ్డి మళ్ళీ మెగా హీరోతోనే సినిమా చేయాలని అనుకున్నాడు.

Advertisement

బన్నీతో సినిమా చేయాలని అనుకుంటే ప్రస్తుతం అతను సుకుమార్ తో పుష్ప సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.ఇక రామ్ చరణ్ అనుకుంటే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ఉన్న అతను ఇప్పట్లో ఖాళీ అయ్యే అవకాశాలు లేవు.

ఇక వరుణ్ తేజ్ కూడా బిజీగానే ఉన్నాడు.పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఖాళీ లేవు.ఈ నేపధ్యంలో సైరా తర్వాత ఏడాది నుంచి ఖాళీగా ఉన్న సురేందర్ రెడ్డి తాజాగా రామ్ కి కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది.

రెడ్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమాని తెరపైకి తీసుకెళ్లదానికి రామ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.మరి స్టైలిష్ దర్శకుడుగా పేరున్న సురేందర్ రామ్ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!
Advertisement

తాజా వార్తలు