నో బాలీవుడ్ అంటున్న సూపర్ స్టార్... తెలుగే సర్వస్వం అంటా

టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

కృష్ణ వారసుడుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన, కెరియర్ ఆరంభంలో వరుసగా సినిమాలు ఫ్లాప్ అయిన కూడా పోకిరి సినిమా తర్వాత ఒక్కసారిగా మహేష్ ఇమేజ్ మారిపోయింది.

స్టార్ హీరోగా మారిపోయి తన బ్రాండ్ పెంచుకుంటూ పోయిన మహేష్ బాబు వరుసగా హిట్స్ కొట్టారు.తెలుగు ఇండస్ట్రీలో అందగాడుగా, అమ్మాయిల కలల రాకుమారుడుగా ఉన్న మహేష్ కి అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ విజయాలతో మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం టాలీవుడ్ లో వంద కోట్ల హీరోగా ఉన్న మహేష్ బాలీవుడ్ ఎంట్రీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.బాలీవుడ్ ప్రముఖులు కూడా మహేష్ ని హిందీ చిత్రపరిశ్రమకి పరిచయం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Advertisement

ఇక మహేష్ భార్య నమ్రతకి బాలీవుడ్ లో మంచి పరిచయాలు ఉండటంతో మహేష్ గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని అందరూ భావిస్తున్నారు.అయితే మహేష్ బాబు మాత్రం బాలీవుడ్ ఎంట్రీపై అంతగా ఆసక్తి చూపించడం లేదు.

ఈ విషయంపై చాలా సార్లు మీడియా వాళ్ళు ప్రశ్నించిన అవకాశం లేదని తేల్చే చెప్పేస్తూ వచ్చారు.తాజాగా సరిలేరు సినిమా సక్సెస్ సందర్భంగా ప్రమోషన్ లో మీడియాతో మాట్లాడుతూ మరోసారి తన బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.

తాను బాలీవుడ్ లోకి వెళ్ళే అవకాశమే లేదని తనకి తెలుగు సినిమానే సర్వస్వం అని స్పష్టం చేశారు.తన మూలాలు ఉన్నవి ఇక్కడే అని, ఇక్కడి ప్రజల ఆశీస్సులే తనకి బలం అని తేల్చి చెప్పేశారు.

అయితే తెలుగు హీరోలు పాన్ ఇండియా మూవీస్ అంటూ ఉంటే మహేష్ బాబు మాత్రం తాను తెలుగుకే పరిమితం అవ్వడం విశేషం అని చెప్పాలి.

షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!
Advertisement

తాజా వార్తలు