బాలయ్య సినిమాలో విలన్ గా తెరపైకి మరో బాలీవుడ్ హీరో

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభించడానికి బోయపాటి సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు.

లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఇక సినిమా నుంచి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసిన సినిమా మీద అంచనాలు పెంచాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సాయేషా సైగల్ ని ఫైనల్ చేసినట్లు గతం నిర్మాత క్లారిటీ ఇచ్చాడు.ఆమె కూడా బాలయ్య సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఇందులో మరో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించాయి.వారిలో ఎవరిని ఫైనల్ చేశారు అనేది తెలియదు.

Advertisement

ఇక బోయపాటి సినిమా అంటే హీరోతో సమానంగా విలన్ పాత్ర కూడా ఉంటుంది.ఈ కారణంగా అతని సినిమాలలో పవర్ ఫుల్ విలన్స్ ని పరిచయం చేస్తూ వచ్చాడు.

జగపతి బాబు, వివేక్ ఒబెరాయ్, ఆది పినిశెట్టి లాంటి వారిని విలన్స్ లో తెరపై భయానకంగా ఆవిష్కరించాడు.ఇప్పుడు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం శ్రీకాంత్ పేరు వినిపించింది.

అలాగే చాలా మంది స్టార్స్ పేర్లు వినిపించాయి.ఇక బాలీవుడ్ నుంచి విలన్ గా సంజయ్ దత్ ని తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది.బోయపాటి విలన్ ని బాలీవుడ్ నుంచే దిగుమతి చేస్తున్నాడని అయితే అతను సంజయ్ దత్ కాదని టాక్.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఒకప్పటి హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ శెట్టిని ఈ సినిమాలో విలన్ గా పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో సునీల్ శెట్టి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

ఇప్పటికే రజినీకాంత్ దర్బార్ సినిమాలో విలన్ గా మెప్పించాడు.ఇప్పుడు బోయపాటి కోసం మరోసారి సౌత్ లో విలన్ వేషం వేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు