Director Rajasekhar Reddy Pulicharla: కథలో సత్తా లేకుంటే ఎంత డబ్బు పెట్టినా వృధానే... డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం గాలోడు.

ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది.

ఇలా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గాలోడు సినిమా కోసం ముందుగా సుధీర్ ను ఎంచుకోలేదని తెలిపారు.

వేరే హీరోని సంప్రదించగా ఆయనకు డేట్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాలో కామెడీ నేపథ్యంలో చేసే హీరోలు కావాలని వెతుకుతున్న సమయంలో కథలోకి ఎంటర్ అయ్యారు.ఇలా సుధీర్ కి జోడిగా రశ్మిని భావించాము అయితే రష్మీ బిజీ కారణంగా నటించలేకపోయారు.

Advertisement

ఈ సినిమా తరువాత సుధీర్ రష్మీ జోడీగా గజ్జల గుర్రం అనే సినిమా చేయబోతున్నట్లు ఈ సందర్భంగా ఈయన ప్రకటించారు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ తనకు కమర్షియల్ డైరెక్టర్ అనే పేరు సంపాదించుకోవాలని ఉంది అంటూ తెలిపారు.అయితే ఇలాంటి పేరు సంపాదించుకోవాలంటే కథలో సత్తా ఉండాలని ఈయన తెలిపారు.మన కథలో కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాని ఆస్వాదిస్తారని అప్పుడే ఆ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ అవుతుంది అంటూ రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం ఇలాంటి పవర్ ఫుల్ కథలు తన దగ్గర నాలుగు ఉన్నాయని అందులో మొదటగా సుధీర్ రష్మితో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను వెల్లడించనున్నట్లు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు