సంచరిస్తున్న మనిషి లాంటి వింత జీవి... వీడియో వైరల్

సాధారణంగా మనకు చీకటి అంటే ఎంతో కొంత భయం ఉంటుంది.

అంతేకాక ఎవరూ లేని దారిలో చీకటిలో మనం ఒక్కరమే వెళ్తుంటే ఇక మనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మనం నడుస్తాం.

కాని ఆ చీకట్లో ఏదైనా శబ్ధం వినిపిస్తే, మనుషులు ఎక్కడా లేని చోట మనిషి లాంటి వింత జీవి కనిపిస్తే ఇక మనకున్న భయం రెట్టింపు కావడం ఖాయం.అవును సరిగ్గా కర్ణాటకలో ఇలానే జరిగినట్టు ఓ వార్త వైరల్ అవుతోంది.

కోటాలోని మంగుళూరు నుండి ఉడిపి హైవేలో ప్రయాణిస్తుండగా ఓ వింత జీవి సంచరించిందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఈ విషయం ప్రచారం లోకి ఎలా వచ్చిందంటే ఓ పేపర్ బాయ్ తాను ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఓ వింత జీవిని ఈ పేపర్ బాయ్ చూశాడని, ఆ వింత జీవి అతనిని వెంబడించిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

కాని అది గొరిల్లా లా కనిపిస్తుందని, చీకటి కాబట్టి మనకు సరిగ్గా ధృవీకరించలేకుండా ఉందని నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

Advertisement
అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Click to Watch Video Here..

తాజా వార్తలు