విలాసాగర్ లో ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం

రాజన్న సిరిసిల్ల జిల్లా:శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ లోని శివాలయ ఆవరణలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణం కన్నుల పండుగ గా జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాలను సర్వంగ సుందరంగా అలంకరించి మేళా తాళాల మధ్య ఊరేగింపుగా కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

కళ్యాణాన్ని తిలకిచ్చేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు ,సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి అంజారావు, ఉప సర్పంచ్ బండారి రాములు గ్రామస్తులు మహిళలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో : అయ్యయ్యో.. యాక్సిలరేటర్ ఎన్ని తిప్పలు పెట్టిందో..

Latest Rajanna Sircilla News