నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ( Vivek Athreya ) డైరెక్షన్లో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయో చూడాల్సి ఉంది.
ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండటంతో సులువుగానే బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమాలో విలన్ గా దయానంద్ పాత్రలో నటించిన ఎస్ జె సూర్య( S J Suryah ) కొన్ని సన్నివేశాల్లో హీరో నాని నే డామినేట్ చేయడం కొసమెరుపు.

సాధారణంగా సినిమాలలో హీరో పాత్ర కంటే విలన్ రోల్ స్ట్రాంగ్ గా ఉంటే సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం సినిమా విషయంలో అదే రూట్ లో వెళ్ళినట్టు తెలుస్తోంది.ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య కాకుండా ఎవరు నటించినా ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అయ్యేది కాదు.ఎస్ జె సూర్య దయానంద్ పాత్రకు ప్రాణం పోశారని చెప్పాలి.
రాబోయే రోజుల్లో తెలుగులో ఎస్ జె సూర్య మరింత బిజీ అయినా ఏమాత్రం ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.సరిపోదా శనివారం సినిమాకు ఎస్ జె సూర్య ఎనిమిది కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఎస్ జె సూర్య తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఫిదా చేశారని చెప్పాలి.సౌత్ లోని బెస్ట్ నటులలో ఎస్ జె సూర్య ఒకరని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

మరోవైపు వరుస విజయాలను అందుకుంటున్న నాని కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తూ తన లక్ష్యాలను సాధిస్తున్నారు.25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్న నాని తనతో సినిమాలను నిర్మించిన నిర్మాతలకు కళ్ళు చెదిరే స్థాయిలో లాభాలను అందిస్తున్నారు. నాని వరుస విజయాలను సొంతం చేసుకోవడంతో భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఇతర భాషల్లో సైతం నాని సినిమాలు( Nani ) సక్సెస్ సాధిస్తే నాని రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.