'పుష్ప'లో ఆ స్పెషల్ సాంగ్ సెకండ్ పార్ట్ లో ఉంటుందట..!

లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్నాడు.

ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.అల్లు అర్జున్ పుష్పరాజ్ గా అదిరిపోయే నటనతో అందరిని ఆకట్టుకున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.మొదటిసారి అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

సరైన సినిమాతోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడని ఇప్పటికే ప్రేక్షకులతో పాటు పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

పరిస్థితులు చక్కబడితే కానీ ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యేలా లేదు.అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనీ అనుకుంటున్నట్టు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో మాస్ సాంగ్స్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టు ఇప్పటికే దేవి శ్రీ తెలిపారు.అయితే ఈ స్పెషల్ సాంగ్ మొదటి పార్ట్ లో ఉండదట.

మసాలా సాంగ్ ను సెకండ్ పార్ట్ లో ఉండబోతుంది.అందుకే ఈ సాంగ్ కోసం మేకర్స్ ఇప్పటి నుండే టెన్షన్ పడకుండా షూటింగ్ మొదలయ్యిన తర్వాత ఆలోచించాలని అనుకుంటున్నారట.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

అయితే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ను దసరా టైం కు తీసుకువచ్చే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట.

Advertisement

తాజా వార్తలు