అందరి చూపు చిన్న సినిమాల మీదే.. విడుదలకు సిద్ధమవుతున్న యువ హీరోలు వీళ్లే?

పెద్ద హీరో.బాగా పాపులారిటీ ఉన్న హీరోయిన్.అప్పటికే ఎన్నో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు.

ఒక మంచి పేరున్న నిర్మాణ సంస్థ.సినిమాలో కావలసినంత కమర్షియల్ ఎలిమెంట్స్.ఇవన్నీ ఉంటేనే ఒకప్పుడు సినిమాలు ఆడేవి అని అనుకునే వారు.

కానీ నేటి రోజుల్లో మాత్రం సినిమాలలో ఇలాంటివి ఏమీ లేకపోయినా చిన్న హీరోలు అప్పుడే ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు కొత్త దర్శకులు అయిన సినిమాలు ఆడుతున్నాయి.ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రేక్షకులు కథాకథనం చూస్తున్నారు తప్ప వందల కోట్ల బడ్జెట్ లు చూడటం లేదు అని చెప్పాలి.

మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిన్న సినిమాలపై ప్రేక్షకులు అందరిలో ఆసక్తి ఉంది అని చెప్పాలి.ఒకప్పుడు కేవలం కామెడీ సినిమాలు మాత్రమే తీసిన అల్లరి నరేష్ నాంది సినిమా తర్వాత పంతం మార్చుకున్నాడు.

Advertisement

అయితే ఇటీవలే మారేడుపల్లి ప్రజానీకం అనే సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిలో ఆసక్తిని పెంచేసిందని చెప్పాలి.మరోవైపు ఎనిమిదేళ్ల క్రితం కార్తికేయ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి హిట్ కొట్టిన హీరో నిఖిల్ ఇక ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వల్ చేయబోతున్నాడు.

ఈ సినిమాపై ఓ రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి.ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ ఇక ఇప్పుడు రంగ రంగ వైభవంగా అనే సినిమా వస్తున్నాడు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాలో వైష్ణవి తేజ్ లో మరో యాంగిల్ ప్రేక్షకులకు పరిచయం కాబోతుందట.స్వాతి ముత్యం అనే టైటిల్ తో ప్రేక్షకులకు సినిమాను కనెక్ట్ అయ్యేలా చేసిన బెల్లంకొండ గణేష్ డిఫరెంట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అని చెప్పాలి.సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షించాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మత్తు వదలరా అనే సినిమాతో అప్పట్లో యూత్ ని బాగా ఎంటర్టైన్ చేసినా నితీష్ రానా ఇప్పుడు లావణ్య త్రిపాటి తో కలిసి కామెడీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన 18 పేజెస్ కోసం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు