'లాక్ డౌన్'లో బాయ్ ఫ్రెండ్ తో రచ్చ చేస్తున్న శృతి హాసన్..?

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నటిగా కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

పలు సినిమాల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా తన నటన ను పరిచయం చేసింది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే శృతిహాసన్ ముంబైకి చెందిన గూగుల్ పెయింట్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో గత కొన్ని రోజుల నుండి ప్రేమాయణం చేస్తున్నట్లు వార్తలు వినిపించగా.

ఆమె సోషల్ మీడియాలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి షేర్ చేసే ఫోటోలను చూస్తే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ప్రేమ అనే అర్థమవుతుంది.ఇటీవల తమ డేటింగ్ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చిన ఈ బ్యూటీ.

Advertisement

ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బాగా రచ్చ చేస్తుంది శృతిహాసన్.తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

అందులో శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతాను తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వగా.అందులో అతడి బుగ్గ గిల్లుతూ, కాస్త రచ్చ చేసినట్లు అనిపిస్తుంది.

ఈ ఫోటోలకు బెస్టీతో లాక్ డౌన్అంటూ షేర్ చేసింది.అంతేకాకుండా గత ఏడాది శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా శాంతను పెట్టిన పోస్టులు వైరల్ కాగా.

అందులో ముంబై రోడ్లపై వీరిద్దరు జంటగా తెగ రచ్చ చేశారు.ఇక ప్రస్తుతం ఈ ఫోటోలను చూసిన నెటిజనులు రక రకాలుగా స్పందిస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ సమయంలో ఇలా షేర్ చేయడం అవసరమా అంటూ.సహాయం చేయడానికైనా ముందుకు రండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు