ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి..: అచ్చెన్నాయుడు

ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎప్పుడు వెళ్లని 30 నియోజకవర్గాల్లో పార్టీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు.ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదన్నారు.

అందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని తెలిపారు.లోకేశ్ పాదయాత్రపై దాడి చేసి తమపైనే తిరిగి కేసులు పెట్టారని ఆరోపించారు.

అయితే వైసీపీ దాడులకు భయపడేది లేదన్నారు.ఏపీలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్న అచ్చెన్నాయుడు చంద్రబాబు సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ఇబ్బంది పెట్టిన వాళ్లకు చక్రవడ్డీతో తిరిగి చెల్లిద్దామని స్పష్టం చేశారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు