ప్రేమ కోసం కెరీర్ ను వదులుకున్న అయేషా గురించి ఈ విషయాలు తెలుసా?

నాగార్జున పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచిన సినిమాలలో సూపర్ సినిమా ఒకటి.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కాగా అనుష్క ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టింది.

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అయేషా టకియా నటించడం గమనార్హం.అయితే అయేషా టకియా అప్పటికీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో మారిపోయారు.

తెలుగులో ఈ హీరోయిన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోయినా బాలీవుడ్ లో మాత్రం సక్సెస్ అయ్యారు.ప్రేమ కోసం కెరీర్ ను వదులుకున్న అయేషా గురించి అభిమానులకు ఎక్కువగా తెలియదు.తన నటనతో ఈ హీరోయిన్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.

పలు యాడ్స్ ద్వారా ఒక వెలుగు వెలిగిన అయేషా తర్వాత రోజుల్లో సరైన కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ కావడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.

Advertisement

2005 సంవత్సరంలో అయేషా ప్రముఖ పార్టీ నేత, బిజినెస్ మేన్ అయిన ఫర్హాన్ అజ్మీతో ప్రేమలో పడ్డారు.2009 సంవత్సరం మార్చి నెలలో వీళ్లిద్దరి వివాహం జరిగింది.పెళ్లి తర్వాత ఇస్లాం మతంలోకి మారిన అయేషా తన పేరు చివరన అజ్మీ చేర్చుకుని అప్పట్లో వార్తల్లో నిలిచారు.

పెళ్లి తర్వాత ఫ్యామిలీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన ఈ బ్యూటీ ఫ్యామిలీకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి కెరీర్ విషయంలో తప్పటడుగులు వేశారు.పెళ్లికి ముందు పలువురు సెలబ్రిటీలతో కూడా ప్రేమాయణం నడిపినట్టు ఈ బ్యూటీ గురించి వార్తలు వినిపించినా ఆ వార్తల గురించి అయేషా ఎప్పుడూ స్పందించలేదు.

అయేషా 2013 దంవత్సరంలో బాబుకు జన్మనివ్వగా ఆ బాబుకు మైఖేల్ అని పేరు పెట్టారు.అయేషా సినిమాలకు దూరంగా ఉన్నా ఫ్యాన్స్ కు మాత్రం దగ్గరగానే ఉన్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు