మిస్ ఇండియా పోటీల నుంచి బయటకొచ్చేసిన హీరో రాజశేఖర్ కుమార్తె.. కారణం అదే!

టాలీవుడ్ సీనియర్ హీరో, హీరోయిన్ డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ గురించి మనందరికీ తెలిసిందే.

శివాని రాజశేఖర్ఇప్పటికీ హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.అయితే శివాని రాజశేఖర్ ఒకవైపు సినిమాలు నటిస్తూనే మరొకవైపు మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా శివాని ఫెమినా మిస్ ఇండియా 2022 అందాల పోటీలో ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటికే మిస్ తమిళనాడుగా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ త్వరలో జరగనున్న గ్రాండ్ ఫినాలేలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది.

అయితే కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా శివానీ మిస్ ఇండియా రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.శివానీ ఒక మెడికల్ స్టూడెంట్ అనే సంగతి చాలా కొద్ది మందికే తెలుసు.

Advertisement

అయితే ఫెమినా మిస్ ఇండియా 2022 గ్రాండ్ ఫినాలే జరగనున్నాయి.కానీ ఆమె జులై 3న తన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు అటెండ్ అవ్వాల్సి ఉంది.

ఈ కారణం చేతనే రాజశేఖర్ తనయ ఫెమినా మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలిగింది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ పోస్ట్ చేసింది శివాని.మొదట నా మెడికల్ థియరీ పరీక్షల కారణంగా తరువాత నేను మలేరియా బారిన పడటం వలన మెజారిటీ ట్రైనింగ్ మరియు వస్త్రధారణ సెషన్లు అన్ని సబ్ కాంటెస్ట్ లను కోల్పోవడం చాలా దురదృష్టకరం.నేను త్వరలో తిరిగి పుంజుకుంటానని ఆశించాను.

కానీ నేను అనుకున్నట్లుగా ఏమీ లేదు.నా ప్రాక్టికల్ పరీక్షలు ప్రీ పోన్ చేయబడ్డాయి.

షారుఖ్ ఖాన్ ఎందుకు సౌత్ డైరెక్టర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు..?
పుట్టినరోజున అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సింగర్ సునీత.. ఏం జరిగిందంటే?

అవి ఈరోజు నుంచే ప్రారంభమవ్వగా ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరగనున్న జులై 3న కూడా నాకు ఎగ్జామ్ ఉంది.అందుకే ఇకపై నేను ఈ జర్నీలో భాగం కాదు అంటూ శివాని బాధ పడుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.

Advertisement

మిస్ ఇండియా పోటీల కోసం తనకు సహకరించిన టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది శివాని.పోటీలో ముందుకు వెళ్లలేకపోయినందుకు క్షమించమని కోరింది.

తాజా వార్తలు