అర్చకుడని నమస్కరిస్తే..ఛీ ఛీ..మహిళలకి షాక్

పవిత్రమైన గుడిలో ఎంతో ప్రశాంత కోసం దేవుడిని ప్రార్ధించి తమ భాధలు చెప్పుకోవడానికి వెళ్తారు భక్తులు అయితే గుడికి వెళ్ళే భక్తులు ఎంత భక్తిగా శ్రద్ధగా వెళ్తారో గుడిలో పూజారి కూడా అంతకంటే ఎక్కువగా భక్తీ శ్రద్దలు కలిగి ఉండాలి అయితే ఓ పూజారి మాత్రం మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తూ ముద్దులు పెడుతూ నీచంగా ప్రవరిస్తున్నాడని మహిలలో ఫిర్యాదు చేస్తే ఆ గుడి నిర్వాహకులు మాత్రం పూజారికే వంత పాడారు.

వివరాలలోకి వెళ్తే.

గోవాలోని మంగూషి ఆలయంలో విధులలో ఉన్న ఓ అర్చకుడు తమను కౌగిలించుకోవడంతో పాటు,తమకి ముద్దులు కోద్ద పెట్టాడని ఇద్దరు మహిళలు వేర్వేరుగా ఆలయ కమిటీకి లేఖలు రాశారు.గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అక్కడ భక్తులు షాక్ కి గురయ్యారు అయితే.సదరు మహిళల ఆరోపణల్లో నిజం లేదని తమ ప్రాథమిక విచారణలో తెలిందన్నారు ఆలయ సెక్రటరీ అనిల్‌.

ఒకవేళ ఆ లేఖల్లో ప్రస్తావించిన అంశాలు నిజమని తెలితే అర్చకుడిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఆ మహిలలో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం తాము గుడికి వచ్చిన సమయంలో నేను అర్చకుడి పాదాలకు నమస్కరించే సమయంలో తను నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దీంతో నేను భయపడి అక్కడి నుంచి వచ్చేశాను.ఆ సమయంలో తన తల్లిదండ్రులు ఆలయంలో వేరేచోట ఉన్నారు.ఈ ఘటనకి సంభందించిన వివరాలు కావాలంటే సీసీటీవీ పుటేజ్ పరిశీలించండి అంటూ ఆమె కమిటీకి తెలిపారు.

Advertisement

మరో మహిళ కూడా తన లేఖలో ఇదే రీతిలో ఫిర్యాదు చేసింది.అయితే ఈ ఘటనపై స్పందించిన గుడి నిర్వాహకులు ఇద్దరు మహిళలకి షాక్ ఇచ్చారు.

ఆమె ఫిర్యాదుపై జూలై 4వ తేదీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు.ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా.

అందులో నిజం లేదని తెలిందన్నారు.ఈ విషయంలో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకున్నా వెళ్ళవచ్చు అంటూ సలహా ఇచ్చారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు