నువ్వు లేకపోతే ఈ జీవితంలో ఇదంతా అయ్యేది కాదు.. సమంత వైరల్ పోస్ట్!

టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం సమంత వరుస సినిమా అవకాశాలతో దూసుకు పోతోంది.

ఓ వైపు వరుసగా సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు సమయం దొరికినప్పుడు వెకేషన్ లను ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలోనే ప్రస్తుతం సమంత కేరళలోని అందాలను వీక్షిస్తూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది.

తన ఫ్రెండ్స్ తో కలిసి కేరళ లోని ప్రాంతాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తోంది.ఈ క్రమంలోనే కేరళలోని అతిరపిళ్ళి వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తోంది సమంత.

ఇక అలెప్పిలో తన ఫ్రెండ్ తో కలిసి సముద్రతీరాన సరదాగా గడిపినట్టు తెలుస్తోంది.మొత్తానికి సమంతా విడాకుల తర్వాత తనకు నచ్చిన విధంగా తన లైఫ్ లీడ్ చేస్తోంది.

Advertisement

తన ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతూ, అదే విధంగా సినిమాలో కూడా మంచి మంచి పాత్రలు ఉన్న క్యారెక్టర్లను ఎంచు కుంటూ దూసుకు పోతోంది.విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎక్కువగా టూర్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.

కొద్ది రోజులు దుబాయ్ కి, ఆ తరువాత స్విజర్లాండ్, ప్రస్తుతం కేరళ అందాలను వీక్షిస్తోంది.అంతే కాకుండా విడాకుల తర్వాత సమంత ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఒకవైపు వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూనే మరొక వైపు సినిమాలలో కూడా నటిస్తోంది.

మరొక వైపు వ్యాపారాలు, ఇలా సమంతా కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉంది.సమంత నటించిన శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.ఇక ప్రస్తుతం యశోద సినిమా షూటింగ్ జరుగుతోంది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

ఇక ఈ సినిమా కోసం భారీగా సెట్ ను వేసినట్లు తెలుస్తోంది.మూడు కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

ఇది ఇలా ఉంటే సమంత తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి సముద్ర తీరాన ఎంజాయ్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ సందర్భంగా తన ఫ్రెండ్ మేఘన వినోద్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.

నువ్వు లేకపోతే ఈ జీవితంలో ఇదంతా చేయగలిగే దాన్నా? అని ఊహించుకోలేక పోతున్నాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.అందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు