అఫైర్స్, అబార్షన్ వార్తలపై ఘాటుగా స్పందించిన సమంత.. ఏం చెప్పారంటే?

స్టార్ హీరోయిన్ సమంత గురించి గత కొన్నిరోజులుగా వెబ్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో, యూట్యూబ్ ఛానెళ్లలో అనేక కథనాలు ప్రసారం కాగా ఆ కథనాల వల్ల ఎక్కువ మంది చైసామ్ విడిపోవడంతో సమంతదే తప్పు అంటూ కామెంట్లు చేశారు.

విడాకులు తీసుకోవడానికి సరైన కారణాన్ని అటు చైతన్య ఇటు సమంత వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే సామ్ ఫ్యాన్స్ మాత్రం ఆ వార్తల్లో నిజం లేదంటూ ఆమెకు సపోర్ట్ చేస్తూ వచ్చారు.ప్రధానంగా పిల్లల విషయంలో చైసామ్ మధ్య విభేదాలు వచ్చాయని ఇప్పటేకి సమంత రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నారని పిల్లల్ని కంటే సినిమా ఆఫర్లు రావని సమంత భావించారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.

అయితే తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టే దిశగా సమంత అడుగులు వేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తుండటం గమనార్హం.తాను అబార్షన్ చేయించుకున్నానని వచ్చిన వార్తల్లో నిజం లేదని సమంత అన్నారు.

విడాకుల తర్వాత తాను కఠిన సమయాన్ని ఎదుర్కొంటున్నానని ఈ సమయంలో ప్రేక్షకులు తనపై చూపిన ఆదరణకు ధన్యవాదాలు అని సమంత చెప్పుకొచ్చారు.తాను పిల్లలను కనడానికి ఇష్టపడలేదని, వేరేవాళ్లతో తనకు అఫైర్స్ ఉన్నాయని అవకాశవాదినని తన గురించి రకరకాలుగా ప్రచారం చేశారని సమంత కామెంట్లు చేశారు.విడాకులు తీసుకోవడం బాధాకరమైన అంశమని సమంత వెల్లడించారు.

Advertisement

కోలుకునే వరకు తనను ఒంటరిగా వదిలేయాలని తన గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయవద్దని ఆమె కోరారు.ఈ తప్పుడు ప్రచారం తనను కృంగదీయదని ఆమె వెల్లడించారు.తనపై ప్రచారంలోకి వస్తున్న ఫేక్ వార్తలకు ట్విట్టర్ పోస్ట్ తో సమంత చెక్ పెట్టారు.

సమంత త్వరలో కొత్త సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

Advertisement

తాజా వార్తలు