సమంత తిరుమల కాలి నడకన ఎక్కినందుకు ఫలితం దక్కింది

అక్కినేని సమంత మజిలీ విడుదలకు మూడు రోజుల ముందు తిరుపతి నుండి తిరుమలకు కాలి నడకన వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న విషయం తెల్సిందే.

ఆ వెంకటేశ్వర స్వామి సమంత మొర ఆలకించాడో ఏమో కాని మజిలీ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

నాగచైతన్యకు మజిలీ చిత్రం సక్సెస్‌ చాలా కీలకం.సమంతకు మజిలీ సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా పర్వాలేదు.

కాని చైతూకు మాత్రం ఇది సక్సెస్‌ అయితేనే కెరీర్‌ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది.అందుకు మజిలీ చిత్రంను సక్సెస్‌ చేయాలని సమంత చాలా తాపత్రయ పడింది.

ఆమె చేసిన ప్రార్థనలు మరియు పూజల వల్ల ఆమెకు ఈ చిత్రం సక్సెస్‌ను అందించింది.కేవలం సక్సెస్‌ మాత్రమే కాకుండా నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ పర్ఫార్మెన్స్‌ అంటూ టాక్‌ను దక్కించుకున్నాడు.

Advertisement

విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు అన్ని ఏరియాల ద్వారా వసూళ్లు భారీగా వచ్చాయి.మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం దాదాపుగా 12.5 కోట్ల వసూళ్లను నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.చైతూ సినిమా మొదటి వీకెండ్‌ కలెక్షన్స్‌ ఈ స్థాయిలో ఉండటం రికార్డుగా ట్రేడ్‌వర్గాల వారు చెబుతున్నారు.

సమంత ఈ చిత్రంలో మొదటి సగం పూర్తి అయ్యే సమయానికి ఎంట్రీ ఇస్తుంది.అంటే ఫస్ట్‌ హాఫ్‌ మొత్తం ఆమె కనిపించకుండా పోతుంది.ఫ్ల్యాష్‌ బ్యాక్‌ సన్నివేశాలు ఉంటాయి.

ఇక సెకండ్‌ మొత్తం కూడా సమంత తన బుజాలపై సినిమాను వేసుకుని నడిపించింది.అన్ని విధాలుగా సమంతకు ఈ చిత్రం మంచి గుర్తింపును, సంతోషాన్ని తెచ్చింది.

ఈ సినిమా విడుదల రోజు తెల్లవారు జామున పావుతక్కువ మూడు గంటలకు లేచి సినిమా ఫలితం కోసం ఎదురు చూసిందట.ఫస్ట్‌ రిపోర్ట్‌ వినగానే సంతోషంగా 30 నిమిషాలు కన్నీళ్లు పెట్టుకుందట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?

మొత్తానికి సమంతకు ఆ శ్రీవెంకటేశ్వరుడు సక్సెస్‌ ను ఇచ్చాడని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు